న్యూఢిల్లీ: ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నిక కావడం గిరిజన ప్రజల సాధికారతకు నిదర్శమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఎన్డీఏ బలపరిచిన ద్రౌపది ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా తిరుగులేని విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మోడీని ప్రధానిగా, ఎస్సీ వర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిగా నిలబెట్టిన గొప్ప చరిత్ర బీజేపీదని తెలిపారు.
గిరిజనుల అభివృద్ధి పట్ల అంకితభావానికి నిదర్శనం
తాజాగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా గెలిపించడం ద్వారా గిరిజనుల అభివృద్ధి పట్ల తమ అంకితభావం అర్థమవుతుందన్నారు. కొన్ని పార్టీలు, కొంత మంది వ్యక్తులు గిరిజనుల అభివృద్ధికి పాటుపడుతున్నట్లు చెబుతున్నారని, కానీ వాళ్లంతా కులం పేరుతో రాజకీయం చేస్తూ ప్రజలను విభజిస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాలను ఆదరించే ఏకైక పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు.
Gujarat | After PM Modi's election, Ramnath Kovind, who hails from a very poor family was made President & now Draupadi Murmu has been elected. It is an answer to people who talk about Tribal empowerment but actually divide people, indulge in politics on the same: HM Amit Shah pic.twitter.com/AUMKUOixqo
— ANI (@ANI) July 23, 2022